జర్మనీ చేరుకున్న మోదీ

ABN , First Publish Date - 2022-05-02T15:54:05+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల విదేశీ పర్యటన మొదలైంది. ఇందులో భాగంగా ఆయన తొలుత జర్మనీ..

జర్మనీ చేరుకున్న మోదీ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల విదేశీ పర్యటన మొదలైంది. ఇందులో భాగంగా ఆయన తొలుత జర్మనీ చేరుకున్నారు. యూరప్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం తెల్లవారుజామున న్యూఢిల్లీ నుంచి జర్మనీకి బయలుదేరారు. ప్రధానమంత్రి కార్యాలయం ఓ ట్వీట్‌లో ఈ విషయం వెల్లడించింది.


ప్రధాని తమ పర్యటన ద్వారా ఆయా దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసి, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలలో మరింత సమన్వయం సాధించనున్నట్టు పీఎంఓ పేర్కొంది. యూరప్ దేశాలు అనేక సవాళ్లతో సతమతమవుతుండటం, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ప్రధాని యూరప్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కోవిడ్ విజృంభణ తర్వాత రెండేళ్లలో తొలిసారి విదేశాల్లో మోదీ పర్యటిస్తున్నారు. ప్రధాని తన జర్మనీ  పర్యటనలో భాగంగా చాన్సలర్ ఓలాష్ షోల్జ్‌‌తో భేటీ అవుతారు. 3వ తేదీన డెన్మార్ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్‌సన్‌తో ద్వైపాక్షిక భేటీ జరుపుతారు. 4న ఇండియా-నార్డిక్ రెండో సదస్సులో పాల్గొంటారు. తిరుగు ప్రయాణంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో భేటీ అవుతారు.

Updated Date - 2022-05-02T15:54:05+05:30 IST