తెలంగాణకు చాలా చేశాం: మోదీ

ABN , First Publish Date - 2022-07-04T00:58:25+05:30 IST

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోందని ప్రధాన మంత్రి మోదీ పేర్కొన్నారు. సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్ మంత్రంతో తెలంగాణను మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు బిజెపి కట్టుబడి వుందన్నారు.

తెలంగాణకు చాలా చేశాం: మోదీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోందని ప్రధాన మంత్రి మోదీ పేర్కొన్నారు. సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్ మంత్రంతో తెలంగాణను మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు బిజెపి కట్టుబడి వుందన్నారు.8ఏళ్లుగా ప్రజల జీవనప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నించామని... తెలంగాణలో అన్ని వర్గాలకు కేంద్ర పథకాలు అందుతున్నాయని మోదీ తెలిపారు. కరోనా సమయంలో తెలంగాణ ప్రజలకు ఎంతో చేశామని... ఉచిత రేషన్, ఉచిత వ్యాక్సిన్ అందించామని మోదీ గుర్తు చేశారు.తెలంగాణ ప్రజల్లో బీజేపీపై నమ్మకం బాగా పెరుగుతోందని, 2019 ఎన్నికల్లోనూ ఇక్కడి ప్రజలు బిజెపికి మద్దతుగా నిలిచారని చెప్పారు.



Updated Date - 2022-07-04T00:58:25+05:30 IST