మెట్రో రైలులో ప్రయాణించిన మోదీ

ABN , First Publish Date - 2021-12-28T20:23:25+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారంనాడు కాన్పూర్ పర్యటనలో భాగంగా మెట్రో రైలులో..

మెట్రో రైలులో ప్రయాణించిన మోదీ

కాన్పూర్: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారంనాడు కాన్పూర్ పర్యటనలో భాగంగా మెట్రో రైలులో ప్రయాణించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురితో కలిసి ఆయన ప్రయాణం సాగించారు. దీనికి ముందు, కాన్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కంప్లీటెడ్ సెక్షన్, బినా-పంకీ మల్టీ ప్రోడక్ట్ పైప్‌లైన్ ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. ఐఐటీ-కాన్పూర్ నుంచి మోతీ జీల్ వరకూ సుమారు తొమ్మిది కిలోమీటర్ల పొడవైన రైల్ ప్రాజెక్టు ఇది. మొత్తం 32 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టును 11,000 కోట్లతో పూర్తి చేస్తున్నట్టు పీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. మోదీ ప్రధానంగా దృష్టి సారిస్తున్న అంశాల్లో అర్బన్ మొబిలిటీ ఒకటని, ఆ దిశగా కాన్పూర్ రైల్ ప్రాజెక్ట్ మరో ముందడుగని తెలిపింది.


కాగా, కాన్పూర్ మెట్రోల్ రైల్ ప్రాజెక్టు ప్రారంభానంతరం ఆ ప్రాజెక్టును ప్రధాని తనిఖీ చేశారు. ఆ వెంటనే ఐఐటీ మెట్రో స్టేషన్ నుంచి గీతానగర్ వరకూ రైలులో ప్రయాణించారు. కాన్పూర్ ఐఐటీ 54వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.

Updated Date - 2021-12-28T20:23:25+05:30 IST