ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు పరిశీలన
ABN , First Publish Date - 2022-07-02T07:04:44+05:30 IST
ఈ నెల 4న ప్రధాని నరేంద్ర మోదీ గ న్నవరం ఎయిర్పోర్టుకు రానున్న నేపథ్యంలో శుక్రవారం భద్రత ఏర్పాట్లను కలెక్టర్ పి.రంజిత్ బాషా ఎస్పీ పి.జాషువాతో కలిసి పరిశీలించారు.
గన్నవరం, జూలై 1 : ఈ నెల 4న ప్రధాని నరేంద్ర మోదీ గ న్నవరం ఎయిర్పోర్టుకు రానున్న నేపథ్యంలో శుక్రవారం భద్రత ఏర్పాట్లను కలెక్టర్ పి.రంజిత్ బాషా ఎస్పీ పి.జాషువాతో కలిసి పరిశీలించారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. 4న ఉదయం 10.10 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారని కలెక్టర్ తెలిపారు. ఇక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వెళతారన్నారు. తిరిగి మధ్యాహ్నం 1. 05 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ వెళతారన్నారు. వీఐపీ లాంజ్, ఇమ్మిగ్రేషన్ భ ద్రతా తనిఖీ విభాగాలు, సెక్రూటీ విభాగాలను పరిశీలించారు. జేసీ మహేష్ కుమార్ రావిరాల, అధికారులు పాల్గొన్నారు.