హైదరాబాద్‌కు చేరుకున్న PM Modi

ABN , First Publish Date - 2022-05-26T18:36:46+05:30 IST

భారత ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు చేరుకున్నారు.

హైదరాబాద్‌కు చేరుకున్న PM Modi

హైదరాబాద్ సిటీ : భారత  ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) హైదరాబాద్‌కు (Hyderabad City) చేరుకున్నారు. మోదీకి.. బీజేపీ కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు. ముందుగా బీజేపీ కార్యకర్తలతో ప్రధాని సమావేశం కానున్నారు. కార్యకర్తల సమావేశంలో మోదీ ప్రసంగించనున్నారు. అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో హెచ్‌సీయూకు వెళ్లనున్నారు.


కాగా.. భాగ్యనగరానికి మోదీ రాకతో బీజేపీ శ్రేణుల్లో సందడి నెలకొంది. సాంస్కృతిక కార్యక్రమాలతో ఎయిర్ పోర్ట్ ప్రాంగణం సందడిగా మారింది. మహిళలు బోనాలతో విమానాశ్రయానికి చేరుకుని స్వాగతం పలికారు. మరోవైపు.. పులి వేషాలు, డప్పు సప్పులతో ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో కోలాహలం నెలకొంది. 

Updated Date - 2022-05-26T18:36:46+05:30 IST