ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంది : మోదీ

ABN , First Publish Date - 2021-10-16T00:24:46+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి సంక్లిష్ట దశ తర్వాత మన

ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంది : మోదీ

సూరత్ : కోవిడ్-19 మహమ్మారి సంక్లిష్ట దశ తర్వాత మన దేశ ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా కోలుకుందని, మన దేశం పట్ల ప్రపంచం ఆశాభావంతో ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగే మార్గంలోకి భారత్ మరోసారి వచ్చిందని ఓ అంతర్జాతీయ సంస్థ చెప్పిందని తెలిపారు. ఓ బాలుర హాస్టల్ నిర్మాణానికి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. 


ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) విడుదల చేసిన నివేదికలో, భారత దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. కోవిడ్ మహమ్మారి, వైద్య, ఆరోగ్య సంబంధిత ఆందోళనలు, సరఫరాల్లో అంతరాయాలు, ధరల ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ భారత దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని తెలిపింది. 


Updated Date - 2021-10-16T00:24:46+05:30 IST