మణిపూర్, త్రిపుర, సిక్కిం సీఎంలకు మోదీ ఫోన్

ABN , First Publish Date - 2021-05-07T21:40:25+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ మణిపూర్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ఆ రాష్ట్రాల్లో ప్రస్తుతం....

మణిపూర్, త్రిపుర, సిక్కిం సీఎంలకు మోదీ ఫోన్

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ మణిపూర్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ఆ రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న కొవిడ్-19 పరిస్థితులపై ఆయన ఆరా తీసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నిన్న ఇదే విషయమై ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్ సీఎంలతో పాటు పుదుచ్చేరి, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లతో  ప్రధాని మోదీ మట్లాడిన విషయం తెలిసిందే. దేశంలో కొత్తగా మరో 4,14,188 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,14,91,598 చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 36 లక్షలు దాటినట్టు ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు గడచిన 24 గంటల్లో ఈ మహమ్మారి కారణంగా 3,915 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా సోకి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,34,083కి చేరినట్టు కేంద్రం వెల్లడించింది. 

Updated Date - 2021-05-07T21:40:25+05:30 IST