సీఎంలతో వర్చువల్‌గా సమావేశం కానున్న ప్రధాని

ABN , First Publish Date - 2022-01-13T02:48:33+05:30 IST

న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా సమావేశం కానున్నారు.

సీఎంలతో వర్చువల్‌గా సమావేశం కానున్న ప్రధాని

న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా సమావేశం కానున్నారు. గురువారం సాయంత్రం నాలుగున్నరకు ఈ సమావేశం జరగనుంది. దేశంలో కోవిడ్ పరిస్థితిపై చర్చిస్తారు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షిస్తారు. ముఖ్యమంత్రులతో సమావేశం తర్వాత కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించాయి. తమిళనాడులో ఆదివారాలు లాక్‌డౌన్ కొనసాగుతోంది. 



Updated Date - 2022-01-13T02:48:33+05:30 IST