12న రాష్ట్రానికి ప్రధాని మోదీ?
ABN , First Publish Date - 2021-12-19T17:00:17+05:30 IST
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 12వ తేదీ రాష్ట్రానికి రానున్నట్టు సమాచారం. విరుదు నగర్లో 12వ తేదీ జరుగనున్న కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని, 11 వైద్య కళాశాలలతో పాటు పలు అభివృద్ధి పనులు
పెరంబూర్(చెన్నై): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 12వ తేదీ రాష్ట్రానికి రానున్నట్టు సమాచారం. విరుదు నగర్లో 12వ తేదీ జరుగనున్న కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని, 11 వైద్య కళాశాలలతో పాటు పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవియా, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. ప్రధాని పర్యటనపై త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు కేంద్రప్రభుత్వ వర్గాల సమాచారం.