PM Narendra Modi Birthday స్పెషల్.. రూ.8లక్షలు గెలుచుకునే ఛాన్స్!

ABN , First Publish Date - 2022-09-16T18:31:45+05:30 IST

భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా దేశ వ్యాప్తంగా భిన్న కార్యక్రమాలు రూపొందుతున్నాయి. బీజేపీ కార్యకర్తలు, ప్రధాని మోదీ అభిమానులు.. ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే

PM Narendra Modi Birthday స్పెషల్.. రూ.8లక్షలు గెలుచుకునే ఛాన్స్!

ఇంటర్నెట్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా దేశ వ్యాప్తంగా భిన్న కార్యక్రమాలు రూపొందుతున్నాయి. బీజేపీ కార్యకర్తలు, ప్రధాని మోదీ అభిమానులు.. ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ప్రజలకు రూ.8లక్షలు(rs 8lakh) గెలుచుకునే అవకాశం కల్పించారు. అంతేకాదు.. మోదీకి ఇష్టమైన కేథారనాథ్ ఆలయాన్ని సందర్శించే అవకాశాన్ని పొందొచ్చు. రూ.8లక్షలు లేదా కేథారనాథ్ సందర్శించే అవకాశాన్ని కొట్టేయాలంటే ఇంతకూ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? ఆ విషయాలు తెలియాలంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.


భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi).. రేపు (సెప్టెంబర్ 17న) 72వ వసంతంలోకి అడుపెట్టబోతున్నారు. ప్రధానిగా మోదీ తన వాగ్ధాటితో దేశ ప్రజలకు చాలా దగ్గరయ్యారు. సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే చప్పన్ ఇంచ్ ప్రధానికి వీరాభిమాని అయిన ఓ రెస్టారెంట్ ఓనర్.. కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. 51 ఇంచుల ప్లేట్‌లోని ఆహార పదార్థాలను తిన్న కస్టమర్లు రూ.8 లక్షలు గెలుచుకోవచ్చని.. న్యూఢిల్లీ(New Delhi)లోని ఆర్డర్ 2.1(order 2.1 restaurant) రెస్టారెంట్ యజమాని సుమిత్ కల్రా తాజాగా ప్రకటించారు. ఇద్దరు కలిసి భోజనాన్ని కేవలం 40 నిమిషాల్లో పూర్తి చేసిన వారిని విజేతలుగా ప్రకటిస్తామని వెల్లడించారు. విజేతలకు రూ.8.5లక్షల బహుమతి(Modi Birthday special) ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. 



అంతేకాకుండా కస్టమర్ల పేర్లను చీటీలపై రాసి, లక్కీ డ్రా కూడా తీస్తామన్నారు. లక్కీ డ్రాలో పేర్లొచ్చిన కస్టమర్లను.. మోదీకి ఇష్టమైన ప్రదేశమైన కేథారనాథ్‌కు ఫ్రీగా పంపిస్తామని వెల్లడించారు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 17 నుంచి ఈ నెల 26 వరకు అమలులో ఉంటుందని చెప్పారు. ఔత్సాహికులు పోటీలో పాల్గొని.. డబ్బులు గెలుచుకోవచ్చని అన్నారు. చంపన్ ఇంచ్ ప్లేట్‌లో 32-33 రకాల ఆహార పదార్థాలు ఉంటాయన్నారు. భారత ప్రధానిగా మోదీ.. దేశానికి ఎంతో మేలు చేస్తున్నారని సుమిత్ అభిప్రాయపడ్డారు. ప్రధానిని ఆదర్శంగా తీసుకుని ఇద్దరు వ్యక్తులకైనా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో.. ఈ ఆఫర్‌ను ప్రకటించినట్టు వివరించారు. 


Updated Date - 2022-09-16T18:31:45+05:30 IST