Pm Modi Called: ఇక ఇళ్లపై జాతీయ పతాకాల రెపరెపలు
ABN , First Publish Date - 2022-07-24T14:19:51+05:30 IST
దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ప్రజలందరూ తమ ఇళ్లపై జాతీయ పతాకాలు ఎగురవేయాలని
- తిరుప్పూర్లో ముమ్మరంగా తయారీ పనులు
పెరంబూర్(చెన్నై), జూలై 23: దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ప్రజలందరూ తమ ఇళ్లపై జాతీయ పతాకాలు ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) పిలుపునిచ్చారు. దీంతో జాతీయ పతాకాలకు గిరాకీ పెరగడంతో తిరుప్పూర్ జిల్లాలో పతాకాల తయారీ(preparation) పనుల్లో మహిళలు(womens), కార్మికులు రేయింబవళ్లూ పనిచేస్తున్నారు. ఈ విషయమై తిరుప్పూర్కు చెందిన వ్యాపారి శరవణకుమార్ మాట్లాడుతూ, తిరుప్పూర్, కోవై జిల్లాల్లో ప్రధానంగా 8 సంస్థలు జాతీయ పతాకాలు తయారు చేస్తున్నాయన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కాగితం, పాలిస్టర్ గుడ్డతో పతాకాలు తయారు చేస్తున్నారని, కానీ కాటన్ గుడ్డతో పతాకాల తయారీ(preparation) ఈ రెండు జిల్లాల్లో జరుగుతోందని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాల ఆర్డర్లు పెరగడంతో రేయింబవళ్లూ తయారీపనులు చేపట్టినట్లు శరవణ కుమార్ తెలిపారు.