హకీంపేట ఎయిర్‌బేస్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2020-11-28T18:53:48+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితమే హకీంపేట ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు

హకీంపేట ఎయిర్‌బేస్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

హైదరాబాద్‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితమే హకీంపేట ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీకి సీఎస్‌, డీజీపీ, సైబరాబాద్‌ సీపీ, కలెక్టర్‌ స్వాగతం పలికారు. మరికాసేపట్లో జినోమ్‌ వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌ సందర్శనకు ప్రధాని బయలుదేరి వెళ్లనున్నారు.  హకీంపేట నుంచి రోడ్డు మార్గంలో జినోమ్‌ వ్యాలీకి  వెళ్లనున్నారు. కొవాగ్జిన్‌ పురోగతిపై శాస్త్రవేత్తలతో ప్రధాని చర్చించనున్నారు.  'కొవాగ్జిన్‌' మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 2:15 గంటలకు బయోటెక్‌ నుంచి హకీంపేటకు ప్రధాని మోదీ తిరుగు పయనంకానున్నారు. 

Updated Date - 2020-11-28T18:53:48+05:30 IST