Rangaswamy: ప్రధానితో రంగస్వామి భేటీ

ABN , First Publish Date - 2022-08-10T13:25:58+05:30 IST

పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి(Rangaswamy) ఢిల్లీలో మంగళవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి

Rangaswamy: ప్రధానితో రంగస్వామి భేటీ

                                - బడ్జెట్‌ నిధులు ఇవ్వాలని వినతి


పుదుచ్చేరి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి(Rangaswamy) ఢిల్లీలో మంగళవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకున్నారు. రాష్ట్రంలో చేపట్టనున్న పథకాలకు, త్వరలో బడ్జెట్‌ కేటాయింపులకు సంబంధించిన నిధులను విడుదల చేయాలని కోరుతూ ఆయన ప్రధానికి వినతిపత్రం సమర్పించారు. రంగస్వామి ముఖ్యమంత్రి(Chief Minister) పదవిని చేపట్టిన ఏడాది తర్వాత ఢిల్లీ వెళ్లడం ఇదే ప్రథమం. సోమవారం రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లిన రంగస్వామి.. అక్కడే పుదుచ్చేరి భవన్‌లో బసచేశారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన ప్రధాని మోదీ(Prime Minister Modi)ని కలుసుకున్నారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆరోగ్యశాఖ మంత్రి మన్‌చుక్‌ మాండవ్యాను కూడా కలుసుకుని రాష్ట్రానికి సంబంధించిన పథకాల అమలుపై చర్చలు జరిపారు.

Updated Date - 2022-08-10T13:25:58+05:30 IST