ప్రపంచ ఆరోగ్య సంస్థను సరిదిద్దాలి : PM Modi

ABN , First Publish Date - 2022-05-13T03:06:38+05:30 IST

న్యూఢిల్లీ : ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)ను తప్పనిసరిగా సంస్కరించాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. మరింత నమ్మకమైన వైద్య భద్రతా విధానంతో

ప్రపంచ ఆరోగ్య సంస్థను సరిదిద్దాలి : PM Modi

న్యూఢిల్లీ : ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)ను తప్పనిసరిగా సంస్కరించాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ( Narendra modi) సూచించారు. మరింత నమ్మకమైన వైద్య భద్రతా విధానంతో పటిష్ట పరిచాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ ప్రయత్నంలో భారత్ తనవంతు సహకారాన్ని అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు రెండవ గ్లోబల్ కొవిడ్ సదస్సు( Global Covid Summit )ను ఉద్దేశించి వర్చువల్‌గా ఆయన మాట్లాడారు. కొవిడ్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రజా కేంద్రక వ్యూహాన్ని రూపొందించాలని సూచించారు. కొవిడ్ సవాళ్లను అధిగమించే చర్యలకు ప్రస్తుత సదస్సు మార్గం చూపాలని, పటిష్టమైన విధానాలను రూపొందించాలని అభిలాషించారు.


కొవిడ్ మహమ్మారి ఇంకా జనజీవనానికి ఇబ్బందులు కలగజేస్తూనే ఉంది. సప్లయ్ చెయిన్‌ను కూడా దెబ్బతీస్తోంది. బహిరంగ సమాజాల మనుగడకు పరీక్షగా మారిందని ప్రధాని మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. భారత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ వ్యాక్సినైజేషన్ జరిగిందని ప్రస్తావించారు. భారతీయ పెద్ద వయస్కుల్లో 90 శాతం మంది సంపూర్ణ వ్యాక్సినేషన్ పొందారని చెప్పారు. కొవిడ్‌పై పోరాటం, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు భారత్‌లో అనేక సాంప్రదాయక ఔషధాలను వినియోగించారని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రపంచానికి అవగాహన కల్పించేందుకు భారత్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంప్రదాయక కేంద్రాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. గతేడాది సెప్టెంబర్ 22న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సారధ్యంలో జరిగిన మొదటి గ్లోబల్ కొవిడ్ సదస్సులో ఆయన పాల్గొన్న విషయం తెలిసిందే.

Read more