PNBకి... కేవలం ATM ఛార్జీల ఆదాయమే... రూ. 645 కోట్లు
ABN , First Publish Date - 2022-05-23T01:39:27+05:30 IST
ఏటీఎం లావాదేవీల ఛార్జీల కింద ప్రభుత్వరంగ పీఎన్బీ(పంజాబ్ నేషనల్ బ్యాంక్) రూ. 645 కోట్లకు పైగా వసూలు చేసింది.
న్యూఢిల్లీ : ఏటీఎం లావాదేవీల ఛార్జీల కింద ప్రభుత్వరంగ పీఎన్బీ(పంజాబ్ నేషనల్ బ్యాంక్) రూ. 645 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆర్టీఐ కింద దాఖలైన ఓ పిటిషన్కు ఇచ్చిన సమాధానంలో పీఎన్బీ ఈ వివరాలను వెల్లడించింది. కిందటి(2021-22) ఆర్థిక సంవత్సరంలో ఏటీఎం ఛార్జీల కింద రూ. 645.67 కోట్ల మొత్తాన్ని పీఎన్బీ వసూలు చేసింది. అంతేకాకుండా... ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్లను నిర్వహించని కస్టమర్ల నుంచి రూ. 239.09 కోట్లను వసూలు చేసింది.