ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2020-12-03T04:12:54+05:30 IST
సీతమ్మసాగర్ ముంపు గ్రామాల సమస్యల ను వెంటనే పరిష్కరించి బ్యారేజ్ పనులను ప్రారంభించాలని భద్రాచలం ఐటీడీఏవో, ఇన్చార్జ్ సబ్ కలెక్టర్ గౌతమ్ పోట్రు అన్నారు.
ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు
అశ్వాపురం డిసెంబరు 2: సీతమ్మసాగర్ ముంపు గ్రామాల సమస్యల ను వెంటనే పరిష్కరించి బ్యారేజ్ పనులను ప్రారంభించాలని భద్రాచలం ఐటీడీఏవో, ఇన్చార్జ్ సబ్ కలెక్టర్ గౌతమ్ పోట్రు అన్నారు. బుధవారం మం డల పరిధిలోని కుమ్మరిగూడెం వద్ద ప్రతిపాదిత సీతమ్మసాగర్ ప్రాజెక్ట్కు సంబంధించిన దుమ్ముగూడెం ఆనకట్టను ఆయన పరిశీలించారు. మ్యాప్ ద్వారా ప్రాజెక్ట్ వివరాలను ఇరిగేషన్, ఎల్అండ్టీ కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపు గ్రామాలైన అమ్మగారిపల్లి, కుమ్మరిగూడెం గ్రామాలకు సంబంధించిన భూములపై నిర్వాసితులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఎటువంటి సమస్యలూ తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.