నాసిరకం పప్పు పంపిణీపై విచారణ
ABN , First Publish Date - 2020-12-03T05:33:15+05:30 IST
తారకరామాకాలనీ అంగన్వాడీ కేంద్రంలో నాసిరకం పప్పు పంపిణీపై సీడీపీవో పి.దుర్గావరలక్ష్మి విచారణ చేపట్టారు.
అనకాపల్లి రూరల్, డిసెంబరు 2: తారకరామాకాలనీ అంగన్వాడీ కేంద్రంలో నాసిరకం పప్పు పంపిణీపై సీడీపీవో పి.దుర్గావరలక్ష్మి విచారణ చేపట్టారు. ఈ కేంద్రంలో నాసిరకం పప్పు దినుసులు పంపిణీ చేస్తున్నారని ‘ఆంధ్రజ్యోతి’లో బుధవారం ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. దీనిపై అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాలిని విచారించారు. అనంతరం కార్యకర్తకు మెమో జారీచేశారు. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆమె చెప్పారు. కార్యక్రమంలో రేబాక సెక్టార్ సూపర్వైజర్ జి.సుహాసిని పాల్గొన్నారు.