నాగసమందర్‌లో ఘనంగా పోచమ్మ బోనాలు

ABN , First Publish Date - 2022-07-07T05:24:44+05:30 IST

నాగసమందర్‌లో ఘనంగా పోచమ్మ బోనాలు

నాగసమందర్‌లో ఘనంగా పోచమ్మ బోనాలు
నాగసమందర్‌లో పోచమ్మ తల్లి బోనాల ఊరేగింపు

ధారూరు, జూలై 6: మండల పరిధిలోని నాగసమందర్‌ గ్రామంలో గ్రామదేవత పోచమ్మకు గ్రామస్తులు బోనాలు సమర్పించారు. బుధవారం సాయంత్రం మహిళలు బోనాలతో గ్రామంలోని పుర వీధుల మీదుగా అమ్మవారి ఆలయానికి తరలివెళ్లారు. ఈ సందర్భంగా పోతురాజుల విన్యాసాలతో బోనాల ఊరేగింపు సాగింది. మహిళలు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి బోననై వేద్యం సమర్పించారు. చల్లగా చూడాలని, పంటలు బాగా పండాలని మొక్కుకున్నారు.

Updated Date - 2022-07-07T05:24:44+05:30 IST