‘పోచారం’ నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2021-07-24T07:13:12+05:30 IST
పోచారం ప్రాజెక్టు నీటిని ఎమ్మెల్యే జాజాల సురేందర్ శుక్రవారం విడుదల చేశారు.
నాగిరెడ్డిపేట, జూలై 24 : పోచారం ప్రాజెక్టు నీటిని ఎమ్మెల్యే జాజాల సురేందర్ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందరంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు అభివృద్ధి విషయమై సీఎం దృష్టికి తీసుకెళతామన్నారు. వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రాజెక్టు, ప్రధాన కాల్వల ఆధునీకరణ కోసం కృషిచేస్తానన్నారు. ప్రధాన కాల్వ ద్వారా 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజ్దాస్, నాయకులు ప్రతాప్ రెడ్డి, బోయిని రాధ విఠల్, శ్రీనివాస్, నాగేందర్, మల్లేశం, తదితరులున్నారు.