న్యాయం చేయాలని పోడు రైతుల ధర్నా

ABN , First Publish Date - 2022-06-26T03:47:32+05:30 IST

మండలం లోని డబ్బా గ్రామానికి చెందిన పోడు రైతులు తహసీల్దార్‌ కార్యాల యం ఎదుట శనివా రం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటవీ అధికారులు పోడుభూముల్లో సాగుచేయకుండా అడ్డుకుంటున్నారని ఆవేధన వ్యక్తంచేశారు.

న్యాయం చేయాలని పోడు రైతుల ధర్నా
చింతలమానేపల్లిలో ధర్నా చేస్తున్న పోడు రైతులు

చింతలమానేపల్లి, జూన్‌ 25: మండలం లోని డబ్బా గ్రామానికి చెందిన పోడు రైతులు తహసీల్దార్‌ కార్యాల యం ఎదుట శనివా రం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటవీ అధికారులు పోడుభూముల్లో సాగుచేయకుండా అడ్డుకుంటున్నారని ఆవేధన వ్యక్తంచేశారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే తమ కుటుంబాలు వీధిన పడే అవకాశం ఉంటుందని వాపోయారు. వివిధ డిమాం డ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌ మునావర్‌ షరీఫ్‌కు అందజేశారు. ఎంపీపీ నానయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులువెంకయ్య,రషీద్‌,రాజన్న పాల్గొన్నారు.

Updated Date - 2022-06-26T03:47:32+05:30 IST