పోలెండ్ చెస్.. ర్యాపిడ్ విజేత ఆనంద్
ABN , First Publish Date - 2022-05-22T09:24:18+05:30 IST
పోలెండ్ చెస్ టోర్నమెంట్ ర్యాపిడ్ విభాగంలో విశ్వనాథన్ ఆనంద్ విజేతగా నిలిచాడు.
వార్సా: పోలెండ్ చెస్ టోర్నమెంట్ ర్యాపిడ్ విభాగంలో విశ్వనాథన్ ఆనంద్ విజేతగా నిలిచాడు. 6 విజయాలు, 2 డ్రాలతో ఓ రౌండ్ మిగిలి ఉండగానే ఆనంద్ టైటిల్ గెలుచుకున్నాడు. ఆరు రౌండ్ల అనంతరం ఐదు విజయాలు, ఒక డ్రాతో ఉన్న భారత గ్రాండ్మాస్టర్.. ఏడో రౌండ్లో డేవిడ్ గవ్రిలెస్యూ (రొమేనియా)ని 25 ఎత్తుల్లో ఓడించాడు. ఎనిమిదో రౌండ్లో అమెరికా గ్రాండ్మాస్టర్ ఫాబియానోతో గేమ్ను ఆనంద్ డ్రా చేసుకున్నాడు.