ఉక్రెయిన్‌పై దురాక్రమణ.. రష్యాతో ప్రపంచకప్ ప్లే ఆఫ్ ఆడబోమన్న పోలండ్

ABN , First Publish Date - 2022-02-26T22:03:03+05:30 IST

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో పోలండ్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 24న మాస్కోలో రష్యాతో

ఉక్రెయిన్‌పై దురాక్రమణ.. రష్యాతో ప్రపంచకప్ ప్లే ఆఫ్ ఆడబోమన్న పోలండ్

వార్సా: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో పోలండ్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 24న మాస్కోలో రష్యాతో జరగాల్సిన ప్రపంచకప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఆడేది లేదని పోలండ్ తేల్చి చెప్పింది. ఈ మేరకు పోలిష్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు సెజరీ కుల్సెజ్ తెలిపారు.


స్వీడన్, చెక్ ఫెడరేషన్లతో కలిసి పనిచేస్తామని చెప్పారు. వారి మ్యాచ్‌లోని విజేతలు రష్యాలో (మార్చి 29)న ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మూడు ఫెడరేషన్లు కలిసి గురువారం సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి. ప్లే ఆఫ్స్‌ను రష్యా నుంచి తరలించాలని ఫిపాను డిమాండ్ చేశాయి.  

Updated Date - 2022-02-26T22:03:03+05:30 IST