దిగొచ్చిన పోలాండ్ సర్కార్...abortionsపై మారిన వైఖరి

ABN , First Publish Date - 2021-11-08T18:16:23+05:30 IST

పోలాండ్ సర్కారు ఎట్టకేలకు దిగి వచ్చింది. గర్భిణుల ప్రాణం ప్రమాదంలో పడినప్పుడు అబార్షన్...

దిగొచ్చిన పోలాండ్ సర్కార్...abortionsపై మారిన వైఖరి

వార్సా (పోలాండ్): పోలాండ్ సర్కారు ఎట్టకేలకు దిగి వచ్చింది. గర్భిణుల ప్రాణం ప్రమాదంలో పడినప్పుడు అబార్షన్ చేయడం చట్టబద్ధమైనదని పోలాండ్ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజాగా వైద్యులకు ఆదేశాలు జారీ చేసింది.22 వారాల గర్భంతో వైద్యపరమైన సమస్యలతో బాధపడుతున్న 30 ఏళ్ల గర్భిణి మరణించడంతో దిగివచ్చిన సర్కారు అబార్షన్లకు అనుమతినిచ్చింది. దక్షిణ పోలాండు దేశంలోని పిస్జినాలోని ఆసుపత్రి వైద్యులు పిండం మనుగడకు తగినంత ఉమ్మనీరు లేనప్పటికీ ఆమె గర్భాన్నితొలగించలేదని బాధిత మహిళ కుటుంబ న్యాయవాది చెప్పారు. 



ఈ కేసులో గర్భిణీ మరణించడంతో పోలెండ్ దేశవ్యాప్తంగా భారీ నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో సర్కారు దీనికి కారణమైన వైద్యులను సస్పెండ్ చేసింది.పోలాండ్ దేశంలో నిర్బంధ అబార్షన్ చట్టం వల్లనే మహిళ మరణించిందని ప్రజలు సర్కారును నిందించారు.మహిళ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు ఆమె ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు గర్భం దాల్చడం చట్టానికి లోబడి ఉంటుందని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది.

Updated Date - 2021-11-08T18:16:23+05:30 IST