ముంపుపై ముఖ్యమంత్రులు పెదవి విప్పాలి

ABN , First Publish Date - 2021-07-27T04:45:01+05:30 IST

పోలవరం వల్ల భద్రాచలానికి కలిగే ముంపుపై ఇద్దరు ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్మోహన్‌రెడ్డి నోరువిప్పి నిజాలు చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు.

ముంపుపై ముఖ్యమంత్రులు పెదవి విప్పాలి
ప్రసంగిస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

భద్రాచలం, జూలై 26: పోలవరం వల్ల భద్రాచలానికి కలిగే ముంపుపై ఇద్దరు ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్మోహన్‌రెడ్డి నోరువిప్పి నిజాలు చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. అశోకనగర్‌ కొత్తకాలనీలో సోమవారం జరిగిన శాఖ ఆరో మహాసభలో ఆయన ముఖ్య అతిఽథిా పాల్గొన్నారు. పోలవరం వల్ల భద్రాచలం డివిజన్‌ గిరిజన జాతికి జరిగే నష్టంపై సీపీఎం 2006లోనే ఉద్యమం ప్రారంభించిందని పేర్కొన్నారు. ఈ ఉద్యమన్ని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తుపాకులతో అణిచివేయాలని ప్రయత్నం చేశారని అన్నారు. ఆ రోజే అన్ని పక్షాలు సీపీఎంతో కలిసి ఉద్యమించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ మిడియం బాబురావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్‌, జిల్లా కమిటీ సభ్యులు ఎంబి నర్సారెడ్డి, సంతోష్‌, శ్రీను, సతీష్‌బాబు, జయ వెంకటరమణ, సత్యవతి, సరోజని, రమణ కళావతి, మునేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T04:45:01+05:30 IST