
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రం మరో ట్విస్ట్ ఇచ్చింది. సామాజిక, ఆర్థిక సర్వే తాజాగా మరోసారి నిర్వహించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం షరతులు విధించింది. పోలవరం నిర్మాణంపై లోకసభలో వైసీపీ ఎంపీలు బ్రహ్మానంద రెడ్డి, సత్యవతి, రెడ్డప్పలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిస్వేస్వర్ టుడు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ పైన డీపీఆర్ తయారు చేయాల్సిందే అని కేంద్రం మరో నిబంధన పెట్టింది.
ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారో గడువు షెడ్యూల్ చెప్పాలని కేంద్ర జలశక్తి శాఖ కోరింది. పోలవరం నిర్మాణంలో ప్రస్తుతానికి రూ.15668 కోట్ల వరకే తమ బాధ్యత అని కేంద్రం మరోసారి తేల్చిచెప్పింది. ఫిబ్రవరి 2022 వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ. 14336 కోట్లు మాత్రమే అని... దీనిలో రూ. 12311 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తిరిగి చెల్లించిందని వెల్లడించింది. అలాగే రూ. 437 కోట్లకు పోలవరం ఆధారిటీ బిల్లులు పంపిందని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది. కేంద్రం కొత్త నిబంధనలతో పోలవరం నిర్మాణం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి