‘పోలవరం’లో ఐఐటీ నిపుణుల బృందం పరిశీలన

ABN , First Publish Date - 2022-04-23T01:35:11+05:30 IST

ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రాజు నేతృత్వంలో 14 మంది ఐఐటీ, జియాలజిస్టుల నిపుణుల బృందం శుక్రవారం పరిశీలించింది.

‘పోలవరం’లో ఐఐటీ నిపుణుల బృందం పరిశీలన

పోలవరం: ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రాజు నేతృత్వంలో 14 మంది ఐఐటీ, జియాలజిస్టుల నిపుణుల బృందం శుక్రవారం పరిశీలించింది. ఈ బృందం ఎగువ కాపర్‌డ్యామ్‌ గ్యాప్‌ 1, 2, పనులు, స్పిల్‌వే ఆప్రోచ్‌ చానల్‌లో డివాల్‌ పనులు, గ్యాప్‌-1లో రింగ్‌ బండ్‌ పనులు, ఎర్త్‌కం రాక్‌ఫిల్‌డ్యాంలో గత రెండేళ్లలో వచ్చిన వరదలకు దెబ్బతిన్న డయా ఫ్రంవాల్‌లను పరిశీలించారు. వీరికి ఎస్‌ఈ నరసింహారావు, ఎస్‌ఈ సుధాకర్‌బాబు, ఈఈ మల్లికార్జునరావు వివరాలు తెలిపారు శనివారం ధవళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశంలో వివరాలు వెల్లడిస్తారని జలనవరుల శాఖ అధికారులు తెలిపారు.

Updated Date - 2022-04-23T01:35:11+05:30 IST