ఇద్దరు నకిలీ విలేకరుల అరెస్ట్
ABN , First Publish Date - 2021-06-21T03:10:40+05:30 IST
ఇద్దరు నకిలీ విలేకరుల అరెస్ట్
కర్నూలు: జిల్లాలోని గూడూరు మండలం సుంకేసుల జంక్షన్ దగ్గర ఇద్దరు నకిలీ విలేకరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ అధికారులమంటూ తనిఖీలు చేపట్టిన ఇద్దరు నకిలీ విలేఖరులు సహా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 48 బాటిళ్ల తెలంగాణ మద్యం సహా రూ.48 వేలు, ఆటో సీజ్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.