హైఫై దొంగలు.. బ్రాండెడ్ బట్టలు, ఖరీదైన మద్యం, విమానంలో ప్రయాణం.. ఇంతకీ వారు ఏం దొంగతనం చేసేవారంటే..

ABN , First Publish Date - 2022-04-19T06:21:41+05:30 IST

ఆ ముగ్గురు వ్యక్తులు చాలా విలాసవంతమైన జీవితం గడుపుతారు.. ఖరీదైన మద్యం తాగుతారు.. బ్రాండెడ్ బట్టలే ధరిస్తారు.. వేరే నగరాలకు వెళ్లాల్సి వస్తే విమానాల్లోనే ప్రయాణిస్తారు.. అలాగని వారేమీ పెద్ద వ్యాపారస్తులు కాదు.. ఆరితేరిన దొంగలు.. రోడ్లు, షాపింగ్ మాల్స్‌లో పార్క్ చేసి ఉన్న కార్లలో...

హైఫై దొంగలు.. బ్రాండెడ్ బట్టలు, ఖరీదైన మద్యం, విమానంలో ప్రయాణం.. ఇంతకీ వారు ఏం దొంగతనం చేసేవారంటే..

ఆ ముగ్గురు వ్యక్తులు చాలా విలాసవంతమైన జీవితం గడుపుతారు.. ఖరీదైన మద్యం తాగుతారు.. బ్రాండెడ్ బట్టలే ధరిస్తారు.. వేరే నగరాలకు వెళ్లాల్సి వస్తే విమానాల్లోనే ప్రయాణిస్తారు.. అలాగని వారేమీ పెద్ద వ్యాపారస్తులు కాదు.. ఆరితేరిన దొంగలు.. రోడ్లు, షాపింగ్ మాల్స్‌లో పార్క్ చేసి ఉన్న కార్లలో ఖరీదైన వస్తువులను వీరు కాజేస్తుంటారు.. వీరిని తాజాగా గురుగ్రామ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 


అంతర్ రాష్ట్ర థక్-థక్ ముఠాకు చెందిన ముగ్గురు దొంగలను గురుగ్రామ్‌లోని ఫరూఖ్‌నగర్ క్రైమ్ బ్రాంచ్ బృందం అరెస్ట్ చేసింది. వీరు రోడ్లు, షాపింగ్ మాల్స్‌లో పార్క్ చేసి ఉన్న కార్ల అద్దాలను పగులగొట్టి లక్షల రూపాయల విలువైన వస్తువులను చోరీ చేసేవారు. దొంగతనాలు చేసిన తర్వాత వీరు విమానాల్లో ప్రయాణించేవారు. ఖరీదైన మద్యం సేవించేవారు. బ్రాండెడ్ దుస్తులు ధరించేవారు. గురుగ్రామ్‌లో ఈ దొంగతనాలపై ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో పోలీసులు నిఘా వేశారు. 


డజను సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, సాంకేతికత సహాయంతో పోలీసు బృందం ఈ దుండగులను అరెస్ట్ చేసింది. వీరి నుంచి 3 ల్యాప్‌టాప్‌లు, 2 మొబైల్ ఫోన్లు, 2 వాచీలు, బంగారు, వెండి ఆభరణాలు, మూడు మహిళల బ్యాగులు, మూడు మద్యం బాటిళ్లు, 29 మెటల్ బుల్లెట్లు, 2.62 లక్షల నగదుప పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఈ ముఠా చాలా కాలంగా యాక్టివ్‌గా ఉందని పోలీసులు చెబుతున్నారు. 

Updated Date - 2022-04-19T06:21:41+05:30 IST