తనపై అత్యాచారం చేశారంటూ కేసు పెట్టిన 22 ఏళ్ల యువతి.. ఆమెనే అరెస్ట్ చేసిన పోలీసులు.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2021-12-30T21:17:46+05:30 IST

ఆమె వయసు ప్రస్తుతం 22ఏళ్లు. స్థానికంగా ఉన్న ఓ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వార్త.. స్థానికంగా చర్చనీయాంశం అయింది. నాపై అత్యాచారం చేశారంటూ కేసు పెట్టిన యువతినే..

తనపై అత్యాచారం చేశారంటూ కేసు పెట్టిన 22 ఏళ్ల యువతి.. ఆమెనే అరెస్ట్ చేసిన పోలీసులు.. అసలు కథేంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఆమె వయసు ప్రస్తుతం 22ఏళ్లు. స్థానికంగా ఉన్న ఓ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వార్త.. స్థానికంగా చర్చనీయాంశం అయింది. నాపై అత్యాచారం చేశారంటూ కేసు పెట్టిన యువతినే.. పోలీసులు అరెస్ట్ చేయడంతో విషయం హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. అత్యాచారం కేసు పెట్టిన యువతినే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారనే వివరాల్లోకి వెళితే..


హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన 22ఏళ్ల యువతి  తన తల్లితో కలిసి నివసిస్తోంది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీలో బీఏ (హానర్స్) చదువుతోంది. కొద్ది రోజుల క్రితం ఈ యువతి.. దాదాపు ఎనిమిది మంది తనపై అత్యాచారం చేశారంటూ పోలీసులను ఆశ్రయించింది. అత్యాచారం చేసిన వారిని అరెస్ట్ చేసి.. తనకు న్యాయం చేయాల్సిందిగా ఫిర్యాదులో కోరింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు ఈ కేసుపై విచారణ జరుపుతున్న సమయంలోనే ఓ సామాజిక కార్యకర్త పోలీసులను సంప్రదించి.. సదరు యవతికి సంబంధించిన కీలక విషయం చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. 



ఈ క్రమంలోనే మరింత లోతుగా పోలీసులు దర్యాప్తు చేశారు. విచారణలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. 22ఏళ్ల యువతే.. కొంత మందిని హనీట్రాప్ చేసి, వారిపైనే తిరిగి ఫేక్ రేప్ కేసులు పెట్టినట్టు గుర్తించారు. దీంతో ఆ యువతిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరపర్చారు. ప్రస్తుతం ఈ యువతి.. జ్యుడీషియల్ కస్టడీలో ఉంది. యువతి తల్లికి మరో వ్యక్తికి కూడా ఈ వ్యవహారంతో సంబంధం ఉండటంతో ప్రస్తుతం వాళ్లు పరారీలో ఉన్నారు. కాగా.. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని.. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. 




Updated Date - 2021-12-30T21:17:46+05:30 IST