చిత్తూరు జిల్లాలో వైసీపీ, టీడీపీ నేతల ఘర్షణ

ABN , First Publish Date - 2022-04-05T18:12:38+05:30 IST

చిత్తూరు జిల్లాలోని కల్లూరు మండలంలో టీడీపీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. 5 రోజుల క్రితం టీడీపీ నేత రాజారెడ్డిపై దాడికి పాల్పడ్డ..

చిత్తూరు జిల్లాలో వైసీపీ, టీడీపీ నేతల ఘర్షణ

చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని కల్లూరు మండలంలో టీడీపీ, వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు. 5 రోజుల క్రితం టీడీపీ నేత రాజారెడ్డిపై దాడికి పాల్పడ్డ.. వైసీపీ శ్రేణులను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసు స్టేషన్ ఎదుట టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ధర్నాకు దిగిన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టీడీపీ నేతపై దాడి చేసిన వైసీపీ నేతలను అరెస్ట్ చేయకుండా పోలీసులు వారికే మద్దతు ఇస్తున్నారని తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. టీడీపీ శ్రేణుల ఆందోళనకు పోటీగా వైసీపీ శ్రేణులు ర్యాలీ తీశారు. దీంతో కల్లూరులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాగా రోడ్డుపై బైఠాయించిన టీడీపీ శ్రేణులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-04-05T18:12:38+05:30 IST