రూ.5 లక్షలు డిమాండ్‌.. TRS కార్యకర్తలపై కేసు

ABN , First Publish Date - 2021-12-06T13:14:59+05:30 IST

ఇన్‌స్పెక్టర్‌ భిక్షపతి తెలిపిన వివరాల ప్రకారం..

రూ.5 లక్షలు డిమాండ్‌.. TRS కార్యకర్తలపై కేసు

హైదరాబాద్ సిటీ/బర్కత్‌పుర : భవన నిర్మాణదారుడి నుంచి డబ్బులు డిమాండ్‌ చేసిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై సుల్తాన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్‌ భిక్షపతి తెలిపిన వివరాల ప్రకారం.. ట్రూప్‌ బజార్‌ ప్రాంతానికి చెందిన కలీం ఇటీవల తన స్థలంలో భవన నిర్మాణం చేపట్టాడు. అనుమతులు లేకుండా వక్ఫ్‌ బోర్డు స్థలంలో నిర్మాణం చేపట్టాడని ఆరోపిస్తూ స్థానికంగా ఉండే టీఆర్‌ఎస్‌ నేత జై శంకర్‌, స్థానికులు అనిల్‌, కిషన్‌లతో పాటు మరి కొందరు కలిసి డబ్బులు డిమాండ్‌ చేశారు. రూ.5 లక్షలు డిమాండ్‌ చేశారని బాధితుడు సుల్తాన్‌ బజార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. కాగా, జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ సర్కిల్‌ -14 ఏసీపీ ఆదేశాల మేరకు ఈ నెల 4న నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేశారు. దీనిపై ఏసీపీ శ్రీనివాస్‌‌ను సంప్రదించగా అది వక్ఫ్‌ బోర్డు స్థలం కాదని, నిర్మాణానికి అనుమతులు లేకపోవడంతో కూల్చినట్లు తెలిపారు.

Updated Date - 2021-12-06T13:14:59+05:30 IST