తెలంగాణలో దొంగతనం చేసి..ఆంధ్రలో పట్టుబడ్డారు!

ABN , First Publish Date - 2021-02-28T17:38:48+05:30 IST

నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో భారీగా నగదు పట్టుబడింది. ఈ నెల 26న తెలంగాణలోని వైరాలో ద్వారకానగర్ ఇంట్లో గుర్తు తెలియని...

తెలంగాణలో దొంగతనం చేసి..ఆంధ్రలో పట్టుబడ్డారు!

విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో భారీగా నగదు పట్టుబడింది. ఈ నెల 26న తెలంగాణలోని వైరాలో ద్వారకానగర్ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీ చేసి అక్కడి నుంచి పరారయ్యారు. తాజాగా ఆదివారం రోజున నందిగామ మండలం జొన్నల గడ్డ వద్ద పోలీసులకు ఈ దుండగులు చిక్కారు. నిందితుల నుంచి సుమారుగా రూ. 35,61,650 లక్షల నగదు, దానితో పాటు బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా వాటి విలువ రూ. 40 లక్షల 79వేలుగా ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిందితులు దినేష్ సింగ్, ఇన్సాఫ్ మహ్మద్ అనే ఇద్దరు వ్యక్తలను అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-02-28T17:38:48+05:30 IST