TS News: బోధ్ అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్
ABN , First Publish Date - 2022-09-01T15:05:55+05:30 IST
జిల్లాలోని బోథ్ అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. మహారాష్ట్ర సరిహద్దులోని కైలాష్ టెక్డీ ప్రాంతంలో నక్సలైట్ల ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఈ మే
ఆదిలాబాద్: జిల్లాలోని బోథ్ అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. మహారాష్ట్ర సరిహద్దులోని కైలాష్ టెక్డీ ప్రాంతంలో నక్సలైట్ల ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఈ మేరకు కూంబింగ్ చేపట్టారు. గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతం నుంచి పోలీసులు నక్సలైట్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా... కూంబింగ్లో గ్రనైడ్ లభించగా... అది శిథిలమై ఉంది. చాలా సంవత్సరాల క్రితం పెట్టి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. గ్రనైట్ విషయం తెలుసుకున్న అటవీ గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.