Covid: 113 మంది పోలీసులకు కరోనా

ABN , First Publish Date - 2022-08-06T15:49:05+05:30 IST

పుదుచ్చేరి(Puducherry)లో 113 మంది పోలీసులకు కరోనా వైరస్‌ సోకినట్టు నిర్థారణ అయింది. దీంతో పోలీస్‌ ట్రైనింగ్‌ స్కూల్‌ మూసివేశారు. గత కొన్ని

Covid: 113 మంది పోలీసులకు కరోనా

పుదుచ్చేరి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): పుదుచ్చేరి(Puducherry)లో 113 మంది పోలీసులకు కరోనా వైరస్‌ సోకినట్టు నిర్థారణ అయింది. దీంతో పోలీస్‌ ట్రైనింగ్‌ స్కూల్‌ మూసివేశారు. గత కొన్ని రోజులుగా పుదుచ్చేరిలో పాజిటివ్‌(Positive) కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో ప్రత్యేక వైద్య బృందాలు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కోరిమేడులోని పోలీస్‌ ట్రైనింగ్‌ కేంద్రం(Police Training Centre)లో శిక్షణ పొందే 390 మందికి వైద్య పరీక్షలు చేయగా, వారిలో 113 మందికి ఈ వైరస్‌ సోకినట్టు తేలింది. దీంతో వారిని ఐసోలేషన్‌కు తరలించి, స్కూల్‌ను తాత్కాలికంగా మూసివేశారు. 

Updated Date - 2022-08-06T15:49:05+05:30 IST