జువెలరీ షాపులో చోరీ కేసును ఛేదించిన పోలీసులు

ABN , First Publish Date - 2022-03-02T21:32:51+05:30 IST

జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నగరంలోని కుమార్‌గల్లిలో

జువెలరీ షాపులో చోరీ కేసును ఛేదించిన పోలీసులు

నిజామాబాద్: జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నగరంలోని కుమార్‌గల్లిలో ఎస్కే జువెలరీ షాపులో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించినట్లు జిల్లా సీపీ నాగరాజు తెలిపారు. వివరాలను మీడియాకు సీపీ వెల్లడించారు. నిందితుడు జైసరం చౌదరి రాజస్థాన్‌ వ్యక్తి అని పేర్కొన్నారు. నిందితుడిపై పలు రాష్ట్రాలలో కేసులు ఉన్నాయన్నారు. నిందితుడి నుంచి 41 తులాల బంగారం, నాలుగున్నర కిలోల వెండి, బైక్, లాప్‌టాప్‌, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని సీపీ పేర్కొన్నారు.

Updated Date - 2022-03-02T21:32:51+05:30 IST