TS News: ‘బ్రహ్మాస్త్ర’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు అనుమతి నిరాకరణ
ABN , First Publish Date - 2022-09-03T01:58:25+05:30 IST
Hyderabad: బాలీవుడ్ హీరో రణధీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచన్, నాగార్జున ప్రధాన తారాగణంగా రూపొందించిన చిత్రం బ్రహ్మస్త్ర. ఈ చిత్రం 9వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో నిర్వహించాలని చిత్ర బృందం భావిస్తున్న సమయంలో పోలీసులు ని
Hyderabad: బాలీవుడ్ హీరో రణధీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచన్, నాగార్జున ప్రధాన తారాగణంగా రూపొందించిన చిత్రం బ్రహ్మస్త్ర. ఈ చిత్రం 9వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో నిర్వహించాలని చిత్ర బృందం భావిస్తున్న సమయంలో పోలీసులు నిరాశ పరిచారు. ప్రీ రిలీజ్ ఈవెంట్కు అనుమతి నిరాకరించారు. గణేష్ ఉత్సవాల బందోబస్తులో సిబ్బంది బిజీగా ఉండడంతో అనుమతి ఇవ్వలేమని రాచకొండ పోలీసులు తెలిపారు. బ్రహ్మాస్త్ర ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా జూ.ఎన్టీఆర్ హాజరుకావాల్సి ఉంది. ఇటీవల కేంద్రమంత్రి అమిత్షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ తర్వాత అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రహ్మాస్త్ర ఈవెంట్కు అనుమతి నిరాకరణపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.