అంగన్‌వాడీ వర్కర్ వద్దకు వెళ్లిన 13 ఏళ్ల బాలిక.. కంగారుగా కనిపించడంతో ఏమైందని అడిగితే ఆమె చెప్పింది విని..

ABN , First Publish Date - 2022-07-30T18:52:39+05:30 IST

స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 13ఏళ్ల బాలిక.. అంగన్‌వాడీ వర్కర్ వద్దకు వెళ్లింది. చిన్నారి కంగారు పడుతుండటాన్ని గమనించిన ఆ అంగన్‌వాడీ వర్కర్.. ఆమెను దగ్గరకు తీసుకుంది. తర్వాత ఏమైందంటూ ఆ బాలికను ప్రశ్నించింది. ఈ క్రమం

అంగన్‌వాడీ వర్కర్ వద్దకు వెళ్లిన 13 ఏళ్ల బాలిక.. కంగారుగా కనిపించడంతో ఏమైందని అడిగితే ఆమె చెప్పింది విని..

ఇంటర్నెట్ డెస్క్: స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 13ఏళ్ల బాలిక.. అంగన్‌వాడీ వర్కర్ వద్దకు వెళ్లింది. చిన్నారి కంగారు పడుతుండటాన్ని గమనించిన ఆ అంగన్‌వాడీ వర్కర్.. ఆమెను దగ్గరకు తీసుకుంది. తర్వాత ఏమైందంటూ ఆ బాలికను ప్రశ్నించింది. ఈ క్రమంలో ఆ చిన్నారి చెప్పింది విని షాకైంది. వెంటనే తనను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. బాలిక ఫిర్యాదు మేరకు అధికారులు ఆమె తండ్రిపై కేసు నమోదు చేశారు. కాగా.. ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..



రాజస్థాన్‌లో(Rajasthan)లోని బండి (Bundi) జిల్లాకు చెందిన 13ఏళ్ల బాలిక.. శుక్రవారం తాను నివసించే ప్రాంతంలో ఉన్న అంగన్‌వాడీ వర్కర్ వద్దకు వెళ్లింది. బాలిక ముఖంలో కంగారును ఆ వర్కర్ గమనించింది. ఏం జరిగిందంటూ చిన్నారిని ప్రశ్నించింది. ఈ క్రమంలో ఆ చిన్నారి నోటి నుంచి వచ్చిన మాటలు విని షాకైంది. సొంత తండ్రి బాలికపై గత రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నట్టు తెలుసుకుని విస్తుపోయింది. చిన్నారిపై జరుగుతున్న అఘాయిత్యాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు(Police).. బాలిక తండ్రిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై డిప్యూటీ సూపరెండెంట్ (Deputy Superintendent)మాట్లాడుతూ.. బాలిక తండ్రిపై పోస్కో చట్టం(POSCO Act) కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. చిన్నారికి రెండేళ్ల వయసు ఉన్నపుడు తల్లి దూరం అయిందని.. అప్పటి నుంచి తండ్రితో కలిసి ఉంటుందని చెప్పారు. అయితే రక్షణ ఇవ్వాల్సిన తండ్రే.. నీచానికి పాల్పడినట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. 




Updated Date - 2022-07-30T18:52:39+05:30 IST