రూ.25 లక్షల విలువ చేసే గుట్కాను పట్టుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2020-09-26T21:32:08+05:30 IST

గుంటూరు: రూరల్ పోలీసులు పెద్ద ఎత్తున గుట్కా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు.

రూ.25 లక్షల విలువ చేసే గుట్కాను పట్టుకున్న పోలీసులు

గుంటూరు: రూరల్ పోలీసులు పెద్ద ఎత్తున గుట్కా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు. కర్ణాటక నుంచి తెనాలికి అడపాల మాధవరావు అక్రమంగా గుట్కాను తరలిస్తున్నారు. తెనాలి మున్సిపల్ మార్కెట్ వద్ద లారీలో తరలిస్తున్న డెబ్బై గుట్కా బస్తాలను సీజ్ చేశారు. సీజ్ చేసిన గుట్కా బస్తాల విలువ ఇరవై ఐదు లక్షల రూపాయలుగా పోలీసులు గుర్తించారు.


గుట్కాలను అక్రమంగా తరలిస్తున్న మాధవరావుతో సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాధవరావుపై పిడి యాక్ట్ అమలు చేసి మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చేస్తామని విశాల్ గున్నీ తెలిపారు. అంతర్వేదిలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని దేవాలయాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో కులాలు, మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విశాల్ గున్నీ వివరించారు. 


 

Updated Date - 2020-09-26T21:32:08+05:30 IST