పోలీసులు అంకితభావంతో విధులు నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-06-28T04:18:07+05:30 IST

పోలీసులు అంకితభావంతో విధులు నిర్వహించాలని రామగుండం పోలీస్‌ కమి షనర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి సూచించారు. సోమవారం ఏసీపీ కార్యాలయం, రూరల్‌ సర్కిల్‌ కార్యాలయం, వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశా రు. పోలీసులు సీపీకి గౌరవ వందనం చేశారు. కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్‌ పరిసరాలను, రికార్డుల ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పెట్రోలింగ్‌ ముమ్మరంగా నిర్వహించాలని, వాహనాల తనిఖీలను చేపట్టాలని సూచించారు.

పోలీసులు అంకితభావంతో విధులు నిర్వహించాలి
పోలీస్‌స్టేషన్‌ పరిసరాలను పరిశీలిస్తున్న సీపీ చంద్రశేఖర్‌ రెడ్డి

బెల్లంపల్లి, జూన్‌ 27: పోలీసులు అంకితభావంతో విధులు నిర్వహించాలని రామగుండం పోలీస్‌ కమి షనర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి సూచించారు. సోమవారం ఏసీపీ కార్యాలయం, రూరల్‌ సర్కిల్‌ కార్యాలయం, వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశా రు. పోలీసులు సీపీకి గౌరవ వందనం చేశారు.  కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్‌ పరిసరాలను, రికార్డుల ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పెట్రోలింగ్‌ ముమ్మరంగా నిర్వహించాలని, వాహనాల తనిఖీలను చేపట్టాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపా లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల న్నారు. సైబర్‌ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. షీటీం ఆవశ్యకతను మహిళలు, విద్యార్థి నులకు తెలియజేయాలన్నారు. డయల్‌ 100కు వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని సూచించారు. మహిళల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వా లని, నేరాల నియంత్రణకు కృషి చేయాలని పేర్కొ న్నారు.   ఏసీపీ ఎడ్ల మహేష్‌, ఇన్‌స్పెక్టర్‌ రాజు, సీఐ బాబురావు, సిబ్బంది ఉన్నారు. 

 

Updated Date - 2022-06-28T04:18:07+05:30 IST