క్రైమ్‌ ఏడీసీపీ బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2022-05-17T06:40:45+05:30 IST

క్రైమ్‌ ఏడీసీపీ బాధ్యతల స్వీకరణ

క్రైమ్‌ ఏడీసీపీ బాధ్యతల స్వీకరణ

విజయవాడ, మే 16 (ఆంధ్రజ్యోతి) : ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌ నేర పరిశోధన విభాగం అదనపు ఉపకమిషనర్‌గా పి.వెంకటరత్నం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా అదనపు ఎస్పీగా పనిచేస్తున్న ఆమెను కొద్దిరోజుల క్రితం ప్రభుత్వం విజయవాడకు బదిలీ చేసింది. ఇప్పటి వరకు ఈ పోస్టులో కొనసాగి, టాస్క్‌ఫోర్స్‌ అదనపు ఉపకమిషనర్‌గా పనిచేస్తున్న కొల్లి శ్రీనివాసరావు ఆమెకు బాధ్యతలను అప్పగించారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా, తూర్పు ఉపకమిషనర్‌ డి.మేరీ ప్రశాంతిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. 

దక్షిణ మండలం ఏసీపీగా రవికిరణ్‌

విజయవాడ దక్షిణ మండలం సహాయ కమిషనర్‌గా డాక్టర్‌ బి.రవికిరణ్‌ నియమితులయ్యారు. ఉద్యోగ బాధ్యతలను సోమవారం స్వీకరించారు. జంగారెడ్డిగూడెంలో డీఎస్పీగా పనిచేస్తున్న ఆయనను విజయవాడ దక్షిణ మండలం సహాయ కమిషనర్‌గా బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా, ఉపకమిషనర్లు మేరీ ప్రశాంతి, జాషువాలను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న మేడిశెట్టి వెంకటేశ్వర్లును పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి అటాచ్‌ చేశారు. 




Updated Date - 2022-05-17T06:40:45+05:30 IST