పోలీస్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలి

ABN , First Publish Date - 2022-01-26T04:30:19+05:30 IST

పోలీస్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలి

పోలీస్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలి
మాట్లాడుతున్న ఎస్పీ కోటిరెడ్డి

  • వికారాబాద్‌ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి

వికారాబాద్‌, జనవరి 25: ప్రతి పోలీస్‌ అధికారి సోదరభావం, సమన్వయంతో పనిచేయాలని వికారాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో డీపీవో స్టాఫ్‌ అధికారులతో కోఆర్డినేషన్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. డీపీవో స్టాఫ్‌ అధికారులు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు గుండెకాయ లాంటి వారని, అధికారులు సిబ్బందితో ఎంప్లాయి ఫ్రెండ్లీగా ఉంటూ పనిచేసుకోవాలన్నారు. ప్రతి నెల డీపీవో అధికారులతో కోఆర్డినేషన్‌ మీటింగ్‌ ఉంటుందని, అందరితో సమన్వయంతో పనిచేసి మంచి పేరు తేవాలన్నారు. మనకు పని దేవుడు అయితే మనం పనిచేసే చోటు ఆలయంతో సమానం అన్నారు. కావున దానిని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రషీద్‌, ఏఆర్‌ డీఎస్పీ సత్యనారాయణ, ఏవో అమర్‌నాథ్‌, డీఎస్బీ అధికారులు నాగేశ్వర, శ్రీనివాస్‌, ఆర్‌ఐలు భరత్‌, భూషణ్‌, అచ్యుత్‌రావు, రత్నం, సూపరింటెండెంట్లు శివకుమార్‌, మోనప్ప, జావీద్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-26T04:30:19+05:30 IST