కడపకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
ABN , First Publish Date - 2022-01-21T04:51:33+05:30 IST
మండల కేంద్రంలోని కడప-పులివెందుల ప్రధాన రహదారిపై గురువారం ఉపాధ్యాయులు రాస్తారోకో చేశారు.
రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేసిన ఉపాధ్యాయులు
పెండ్లిమర్రి, జనవరి 20 : మండల కేంద్రంలోని కడప-పులివెందుల ప్రధాన రహదారిపై గురువారం ఉపాధ్యాయులు రాస్తారోకో చేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల కలెక్టరేట్ వద్ద నిరసనకు పిలుపు మేరకు పులివెందుల, వేంపల్లెలకు చెందిన ఉపాధ్యాయులు కడపకు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ అర్ధరాత్రి ఇచ్చిన తిరోగమన పీఆర్సీ జీవోను రద్దు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయన్నారు. పోలీసులు ఉపాధ్యాయ సంఘాల నాయకులను, ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు.