పేకాట శిబిరంపై పోలీసుల దాడి
ABN , First Publish Date - 2021-10-24T03:16:10+05:30 IST
జిల్లాలో పేకాట శిబిరంపై పోలీసులు ఉక్కుపాదం
కృష్ణా: జిల్లాలో పేకాట శిబిరంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మైలవరంలోని రెడ్డిగూడెం మండలంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసారు. వైసీపీ నాయకుల కనుసన్నల్లో గుట్టు చప్పుడు కాకుండా పేకాట శిబిరం జరుగుతోంది. 11 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.3,76,930లను ఎస్ఐ స్వాధీనం చేసుకున్నారు. మూడు కార్లు, మూడు బైక్లను పోలీసులు సీజ్ చేసారు. అధికార పార్టీ నాయకులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.