కోడిపందేల స్థావరాలపై పోలీసుల దాడి

ABN , First Publish Date - 2021-01-16T06:24:11+05:30 IST

మండలంలోని పోమేనాయక్‌తండా, అగ్రహారం గ్రామాల్లో కోడిపందేల స్థావరాలపై గు రువారం దాడి చేసి 55 మందిని అదుపులోకి తీసుకున్నట్లు కదిరి రూరల్‌ సర్కిల్‌ ఇన్సపెక్టర్‌ మధు, తనకల్లు ఎస్‌ ఐ శ్రీనివాసులు తెలిపారు.

కోడిపందేల స్థావరాలపై పోలీసుల దాడి

- రూ. 28,300 నగదు స్వాధీనం - 55 మంది అరెస్ట్‌

- మారువేషాల్లో వెళ్లిన సీఐ, ఎస్‌ఐ

తనకల్లు, జనవరి 15 : మండలంలోని పోమేనాయక్‌తండా, అగ్రహారం గ్రామాల్లో కోడిపందేల స్థావరాలపై గు రువారం దాడి చేసి 55 మందిని అదుపులోకి తీసుకున్నట్లు కదిరి రూరల్‌ సర్కిల్‌ ఇన్సపెక్టర్‌ మధు, తనకల్లు ఎస్‌ ఐ శ్రీనివాసులు తెలిపారు. వారి నుంచి రూ. 28,300 నగదు,  39 సెల్‌ఫోన్లు, 15 నాటుకోడి పుంజు లు, 13 కోడిపుంజులకు కట్టే కత్తులు, 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకు న్నట్లు వారు విలేకరులకు తెలిపారు. తాము తమ సిబ్బందితో మారువేషాల్లో వెళ్లి ఈ దాడులు చేశామన్నారు. పోమేనాయక్‌తండా వద్ద  23 మందిని, అగ్రహారం వద్ద 33 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసి సొంత పూచీకత్తు పైన విడుదల చేసినట్లు తెలిపారు. 

Updated Date - 2021-01-16T06:24:11+05:30 IST