పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు.. ఏడుగురి అరెస్ట్

ABN , First Publish Date - 2022-06-16T13:42:11+05:30 IST

జిల్లాలో పోలీసులు పేకాట స్థావరాలపై దాడులు చేశారు. దమ్మపేట మండలంలోని గాంధీనగర్ పామాయిల్ తోటలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను..

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు.. ఏడుగురి అరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో పోలీసులు పేకాట స్థావరాలపై దాడులు చేశారు.  దమ్మపేట మండలంలోని గాంధీనగర్ పామాయిల్ తోటలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు, 11200 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి పోలీసులు కేసు నమోదు చేశారు. పేకాట ఆడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. 

Updated Date - 2022-06-16T13:42:11+05:30 IST