టూవీలర్‌ ఆటో కన్సల్టెన్సీ ఆఫీసులపై పోలీసుల దాడులు

ABN , First Publish Date - 2021-01-22T04:54:43+05:30 IST

కడప నగరం పాలెంపాపయ్యవీధిలోని ఆటో కన్సల్టెన్సీ ఆఫీసులపై గురువారం పోలీసులు దాడులు నిర్వహించారు.

టూవీలర్‌ ఆటో కన్సల్టెన్సీ ఆఫీసులపై పోలీసుల దాడులు
రిజిస్ట్రేషన్ల వాహనాల ఫైల్‌ను పరిశీలిస్తున్న డీఎస్పీ సునీల్‌

కడప(క్రైం), జనవరి 21: కడప నగరం పాలెంపాపయ్యవీధిలోని ఆటో కన్సల్టెన్సీ ఆఫీసులపై గురువారం పోలీసులు దాడులు నిర్వహించారు.  కడప డీఎస్పీ సునీల్‌ ఆధ్వర్యంలో వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణ, రిమ్స్‌ సీఐ సత్యబాబు, చిన్నచౌకు సీఐ అశోక్‌రెడ్డి, తాలుకా సీఐ నాగభూషణం, టూటౌన్‌ సీఐ ఆలీల ఆధ్వర్యంలో సిబ్బందితో టూవీలర్‌, ఆటో కన్సల్టెన్సీ ఆఫీసులపై దాడులు చేశారు. రికార్డులు లేని 18 వాహనాలను సీజ్‌ చేసి వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ టూవీలర్‌ క్రయ విక్రయాలు జరిపేటప్పుడు వాహనాలకు సంబంధించి పేపర్లు, ఇన్సూరెన్స్‌ సక్రమంగా ఉండాలన్నారు. రికార్డులు లేని వాహనాలు ఉంటే   సీజ్‌ చేయడంతో పాటు కన్సల్టెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో చిన్నచౌకు ఎస్‌ఐ అమర్‌నాధరె డ్డి, ఎస్‌ఐలు హసన్‌, మధుసూధన్‌రెడ్డి, రామకిష్ణ్ర, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-01-22T04:54:43+05:30 IST