Bhadradri: గోదావరి కరకట్ట వద్ద పోలీసుల ఆంక్షలు

ABN , First Publish Date - 2022-07-15T15:44:18+05:30 IST

గోదావరి కరకట్ట వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. మీడియాను అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు.

Bhadradri: గోదావరి కరకట్ట వద్ద పోలీసుల ఆంక్షలు

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని గోదావరి కరకట్ట వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. మీడియాను అనుమతించేందుకు నిరాకరించారు. కరకట్ట గురించి పలు చానల్స్, సోషల్ మీడియాలో నాటి చంద్రబాబు, తుమ్మల హయాంలో నిర్మాణం చేశారనే కవరేజ్ వచ్చింది. కరకట్టపై మీడియాలో విస్తృత ప్రచారం సాగడంతో ఈరోజు పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో పోలీసులకు మీడియా ప్రతినిధులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసులపై ఓ ముఖ్య ప్రజా ప్రతినిధి ఒత్తిళ్లతోనే ఆంక్షలు అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. బాధ్యతాయుతంగా కవరేజ్ చేసే మీడియాపై ఉక్కు పాదం మోపడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మీడియాపై ఆంక్షల గురించి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు జర్నలిస్ట్ సంఘాలు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. 

Updated Date - 2022-07-15T15:44:18+05:30 IST