పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-10-24T06:31:47+05:30 IST

పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహించి కమిషనరేట్‌ కు మంచి పేరు తీసుకురావాలని రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు.

పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి
పరేడ్‌ను పరిశీలిస్తున్న సీపీ చంద్రశేఖర్‌రెడ్డి

- సమస్యలు ఉంటే దృష్టికి తీసుకురండి..

- రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి

కోల్‌సిటీ, అక్టోబరు 23: పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహించి కమిషనరేట్‌ కు మంచి పేరు తీసుకురావాలని రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. శనివారం రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో గోదావరిఖని సబ్‌డివిజన్‌కు సంబంధించిన సివిల్‌, ఆర్మ్‌డ్‌పోలీస్‌ సిబ్బందికి వీక్లీ పరేడ్‌ నిర్వహించగా ఈ కార్యక్రమానికి సీపీ చంద్రశేఖర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరేడ్‌ వల్ల సిబ్బందికి ఫిజికల్‌ ఫిట్‌నెస్‌, ఇతర ఏ సమస్యలు ఉన్నా తనకు కానీ, ఉన్నతాధికారులకానీ చెప్పాలన్నా రు. ఎలాంటి చెడు అలవాట్లకు లోనుకాకుండా మంచి జీవన విఽదానాన్ని అవలంభించాలని, క్రమశిక్షణతో పాటు మంచి ప్రవర్తనతో మెలుగుతూ ప్రజలకు సేవలందించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని, సమయం దొరికినప్పుడల్లా సిబ్బంది వ్యాయామంతో పాటు ఇతర క్రీడల్లో పాల్గొని ఆరో గ్యంగా ఉండాలన్నారు. అనంతరం సిబ్బంది ప్రదర్శించి ఆర్మ్‌డ్‌డ్రిల్‌, ఫుట్‌డ్రిల్‌, సెర్మో నల్‌ డ్రిల్‌ను ఆయన పరిశీలించారు. 

Updated Date - 2021-10-24T06:31:47+05:30 IST