స్టేషన్కెళ్తే బాధితులకు లాఠీలతో సమాధానం
ABN , First Publish Date - 2022-08-19T04:43:41+05:30 IST
వెంకటాచలం సీఐ, ఎస్ఐలు వైసీపీ నాయకులకు తొత్తులుగా మారి పోలీస్ స్టేషన్కు న్యాయం కోసం వెళ్లే బాధితులను లాఠీలతో తీవ్రంగా కొడుతున్నారని బీజేపీ మండలాధ్యక్షుడు కుంచి శ్రీనివాసులు యాదవ్, జిల్లా నాయకులు మిడతల రమేష్ విమర్శించారు.
బీజేపీ మండలాధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్
వెంకటాచలం, ఆగస్టు 18 : వెంకటాచలం సీఐ, ఎస్ఐలు వైసీపీ నాయకులకు తొత్తులుగా మారి పోలీస్ స్టేషన్కు న్యాయం కోసం వెళ్లే బాధితులను లాఠీలతో తీవ్రంగా కొడుతున్నారని బీజేపీ మండలాధ్యక్షుడు కుంచి శ్రీనివాసులు యాదవ్, జిల్లా నాయకులు మిడతల రమేష్ విమర్శించారు. పోలీసుల లాఠీ దెబ్బలకు తీవ్రంగా గాయపడి నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎగువమిట్ట గ్రామానికి చెందిన నెల్లూరు చంద్రశేఖర్ను గురువారం బీజేపీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకులకే న్యాయం జరుగుతుందని, ఇతరులెవరికీ జరగదని ఒక బోర్డు ఏర్పాటు చేస్తే ఎవరూ రారన్నారు. వెంకటాచలం పోలీస్ స్టేషన్పై ఎస్పీ ప్రత్యేక దృష్టి పెట్టాలని, సీఐ, ఎస్ఐ అరాచకాలపై విచారణ జరిపి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి అల్లూరు ప్రసాద్ నాయుడు, నాయకులు హసనాపురం శ్రీనివాసులు, పిల్లిపాకుల పెంచలయ్య, గోత్తల నరేష్ తదితరులున్నారు