పోలింగ్ కేంద్రాల పరిశీలన
ABN , First Publish Date - 2021-03-07T02:38:29+05:30 IST
పట్టణంలోని మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల పరి
నాయుడుపేట, మార్చి 6 : పట్టణంలోని మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలకుడు బసంత్కుమార్ పరిశీలించారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ నెల 10వ తేదీ 24వ వార్డుకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు శనివారం ఎన్నికల జిల్లా పరిశీలకుడు పరిశీలించి అధికారులకు పలు సలహాలు అందజేశారు. అలాగే 6వ వార్డుకు జరిగే పోలింగ్ కేంద్రాన్ని కూడా ఎన్నికల పరిశీలకుడు పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూము, కౌంటింగ్హాల్ను పరిశీలించారు. ఆయన వెంట కమిషనర్ లింగారెడ్డి చంద్రశేఖర్రెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.